ప్రముఖ ఇండియన్‌ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ లావా తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది

బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చారు

4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో G37 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను ఇచ్చారు

ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ సామర్థ్యం గల పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు

వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌తో ఫోన్ ర్యామ్‌ను 3GB వరకు పెంచుకోవచ్చు

13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు అందించారు

ధర విషయానికొస్తే లావా బ్లేజ్‌ ఎన్‌ఎక్స్‌టీ రూ. 9,299గా ఉంది