మత్తు కళ్లతో మాయ చేస్తున్న యుక్తి తరేజా

TV9 Telugu

09 March 2024

టాలీవుడ్ లోకి మరో కొత్త బ్యూటీ వచ్చింది.  అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.. ఆమె ఎవరో కాదు యుక్తి తరేజా.

 నాగశౌర్య హీరోగా నటించిన ‘రంగబలి’ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ యుక్తి తరేజా.

యుక్తి తరేజా హర్యానాకు లోని కర్నాల్  లో జన్మించింది. ఈమె ఢిల్లీ లో ఓ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్‌) చదివింది ఈ చిన్నది.

ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడ డాన్స్‌ పోటీలు, ప్రదర్శనల్లో పాల్గొంటూ మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

2021 లో వచ్చిన ఇమ్రాన్‌ హష్మీతో కలిసి చేసిన ‘లుట్ గయే’ పాటతో బాగా పాపులర్ అయింది యుక్తి తరేజా. ఈ పాట వల్లే ‘రంగబలి’లో నటించే అవకాశం అందుకుంది.

మాతృభాష హిందీకావడం వల్ల తెలుగులో నటించేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నదట.. కానీ ఆ విషయంలో దర్శకత్వ బృందం సాయం చేసిందని తెలిపింది.

యుక్తికి హీరో అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టమట అలానే ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయాలని ఉందట ఈ ముద్దుగుమ్మకు. అలానే హీరోయిన్స్‌లో అనుష్క అంటే అభిమానం అని తెలిపింది.

యుక్తి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.