టాలీవుడ్ లో ఒక్కసారిగా పేరు మార్మోగిపోయిన హీరోగా అడివి శేష్

Anil Kumar

09 August 2024

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ ఉన్న హీరోల్లో యంగ్ హీరో "అడివి శేష్" కూడ ఒకరు అని చెప్పొచ్చు.

కేవలం నటుడిగానే కాకుండా రైటర్ గానూ, డైరెక్టర్ గానూ తనకున్న స్పెషల్ టాలెంట్ తో సత్తా చాటుతున్నాడు శేష్.

కెరీర్ ప్రారంభంలో సొంతం నుండి బాహుబలి, సైజ్ జీరో వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు అడివి శేష్.

ఇదే క్రమంలో 2016 లో క్షణం సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో.

ఆ తర్వాత గూఢచారి, హిట్‌ 2, ఎవరు, మేజర్‌.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో శేష్ పేరు మార్మోగిపోయింది.

హీరోగానే కాదు తనకున్న మంచి మనసుతో మానవత్వాన్ని సైతం చాటుకున్న సందర్భాలు కొన్ని తెలుస్తున్నాయి. మొన్నీ మధ్య..

కేన్సర్‌తో పోరాడుతున్న పాపతో రోజంతా సమయం గడిపారు నటుడు అడివి శేష్‌. తనను ఆ పాప అభిమానిస్తుందని తెలియగానే..

ఆమె కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు శేష్‌. పాపకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని నేరుగా వెళ్లి కలిశారు.