యాత్ర 2 ట్రైలర్.. సల్మాన్‌తో సందీప్ వంగా..!

TV9 Telugu

05 February  2024

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా వస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా యాత్ర 2.

ఆయన ప్రతిపక్షంలో ఉన్నపుడు చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మహి వి రాఘవ్.

2019లో వచ్చిన యాత్ర సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో జగన్ పాత్రలో జీవా నటిస్తుండగా.. రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి కంటిన్యూ అయ్యారు.

ఫిబ్రవరి 8న యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆఫీసియల్ ట్రైలర్ విడుదల చేసారు.

రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు సందీప్ రెడ్డి వంగా.

దీనికంటే ముందు తెలుగు అర్జున్ రెడ్డికి రీమేక్ గా ఆయన తెరకెక్కించిన కబీర్ సింగ్ కూడా సంచలన విజయమే సాధించింది.

త్వరలోనే సందీప్ వంగా బాలీవూడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ హీరోగా హిందీలో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అంత ఓకే అయినా కూడా ప్రభాస్ హీరోగా స్పిరిట్ తర్వాతే ఇది పట్టాలెక్కేది.