ఈ వయ్యారి అందాన్ని చూస్తే ఆ మన్మధుడైనా ఫిదా అవ్వాల్సిందే..

25 December 2023

TV9 Telugu

4 ఆగస్టు 1999న దేశ రాజదాని ఢిల్లీ నగరంలో ఓ పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది అందాల తార యాషికా ఆనంద్.

కుటుంబంతో చెన్నైకి మారిన తర్వాత చెట్‌పేట్‌లోని షేర్‌వుడ్ హాల్ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసింది.

ఈ వయ్యారి భామ మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ లో కూడా బాగా ఫేమస్ అవడంతో సినిమా అవకాశాలు వచ్చాయి.

2015లో 14 ఏళ్ళ వయసులో సంతానంతో కలిసి ఇనిమే ఇప్పడితాన్ నటించింది. పాటల చిత్రీకరణకు హాజరు కాకపోవడంతో ఆమె పాత్ర తొలగించబడింది.

ఆ తర్వాత 2016లో కవలై వెండం స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా నటించింది. అది ఆమె మొదటి థియేట్రికల్ రిలీజ్ అయింది.

2016లో చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ధురువంగల్ పతినారు చిత్రం విజయవంతమై ఈ ముద్దుగుమ్మకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత 2018లో పాదం; నటుడు, దర్శకుడు తంబి రామయ్య తెరకెక్కించిన మణియార్ కుటుంబంలో కనిపించింది ఈ బ్యూటీ.

అదే ఏడాది విజయ్ దేవరకొండకి జోడిగా నోటా అనే పొలిటికల్ థిల్లర్ చిత్రంలో కథానాయకిగా కనిపించింది ఈ వయ్యారి.