మే 9 వైజయంతీ మూవీస్‌కి చాల స్పెషల్.. ఎందుకంటే.. 

Battula Prudvi

15 October 2024

అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కి మే 9 మరిచిపోలేని రోజు. సి.అశ్వినీదత్  కొన్ని చిత్రాలను నిర్మించి ఆ రోజునే విడుదల చేశారు.

వైజయంతి మూవీస్ నిర్మాణంలో మే 9న విదులైన నాలుగు సినిమాల్లో 3 సినిమాలు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్‎గా నిలిచాయి.

1990 మే 9న విడుదలైన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చరిత్ర సృష్టించింది. దీన్ని వైజయంతి మూవీ నిర్మించింది.

2018 మే 9న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి నిర్మాణంలో వచ్చిన మహానటి కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

2019 మే 9న వంశి పైడిపల్లి, మహేష్ బాబు కాంబోలో మహర్షి సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది. ఇది కూడా బ్లాక్ బస్టర్.

ప్రభాస్ కల్కి 2898 AD కూడా ఆ రోజునే విడదల చేయాలనుకున్నారు. ఇది జరిగుంటే మరో హిట్ వైజయంతి మే 9 ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఉండేది.

అయితే కొన్ని కారణాల వల్ల కల్కి సినిమా వాయిదా పడి జూన్ 27న విడుదలై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‎గా 1100 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

అయితే ఇదే బ్యానర్‎లో 2003 మే 9న వచ్చిన కంత్రి డిజాస్టర్ అయినప్పటికీ ఇందులో ఎన్టీఆర్ 3D యానిమేటెడ్ పాత్రకి ప్రశంసలు లభించాయి.