TV9 Telugu

అప్పుడే ఓటీటీలోకి సైంధవ మూవీ.. అనుకున్న తేదీ కంటే ముందుగానే.

24 January 2024

విక్టరీ వెంకటేశ్‌ సైంధవ్‌ సినిమా జనవరి 13న థియేటర్లలో రిలీజైన అయ్యిన విషయం తెలిసిందే.

శైలేష్ కొల‌ను తెరకెక్కించిన సైంధవ్‌ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది.

ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 

ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే ముందుగానే వెంకీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యిందని టాక్‌..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సైంధవ్‌ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది.

ఒప్పందం ప్రకారం ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రునే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని భావించారు.

అయితే కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీల్లో ఏదో ఒక రోజు సైంధవ్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారట. 

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై సైంధవ్‌ సినిమాను నిర్మించారు.