చివరి మిషన్‌కు ‘సైంధవ్‌’..

వెంకటేష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’.

ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్స్ శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం డిసెంబరు 22న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా బుధవారం ఈ చిత్రం ఓ కీలక షెడ్యూల్‌ను ముగించుకుంది.

‘మా సైంధవ్‌ చివరి మిషన్‌ దిశగా దూసుకెళుతోంది’ అని ఓ వీడియోను షేర్ చేసింది బృందం.