TV9 Telugu

34 ఏళ్ల‌కు పిల్ల‌ల‌ను క‌నాల‌నుకున్నా కుద‌ర్లేదు.: వరలక్ష్మి.

25 March 2024

త‌న సినీ, వ్య‌క్తిగ‌త జీవితం గురించి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తాజాగా కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.

18 ఏళ్ల‌ వ‌య‌సులోనే హీరోయిన్ గా శంక‌ర్ బాయ్స్‌సినిమాలో ఛాన్స్ వచ్చినా తండ్రి శ‌ర‌త్ కుమార్ నో చెప్ప‌డంతో మనుకుంది అంట.

ఆ త‌ర్వాత 2012లో ధ‌నుష్ స‌ర‌స‌న 'పోడాపోడీ' మూవీతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన‌ట్లు పేర్కొన్నారు వరలక్ష్మి.

ఇక ఇప్పుడు సౌత్ లో సంచ‌ల‌న న‌టిగా ముద్ర వేసుకున్న ఆమె ఇప్పుడు ఎలాంటి పాత్ర‌నైనా, ఏ భాషైనా ట్రెండ్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం వ‌ర‌లక్ష్మికి 38 ఏళ్లు. గ‌త నెల‌లోనే ముంబైకి చెందిన నిక్కోలాయ్ స‌చ్‌దేవ్‌ తో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఆర్ట్ గ్యాల‌రీ న‌డుపుతున్న నిక్కోలాయ్ స‌చ్‌దేవ్‌ తో వ‌ర‌ల‌క్ష్మీ 14 ఏళ్ల స్నేహం ఉందట‌. ఆయనకు ఇది రెండో పెళ్లి.

వరలక్ష్మి మొద‌టి చిత్రం టైంలో త‌న వ‌య‌సు 22 ఏళ్లు, ఎలాగైనా 28 ఏళ్ల‌లోపు స్టార్ న‌టిగా ఎద‌గాల‌ని భావించినట్లు చెప్పారు.

అలాగే 32 ఏళ్లకు పెళ్లి చేసుకుని 34 ఏళ్ల‌లో పిల్ల‌ల్ని క‌నాల‌ని అనుకున్నానని, కానీ ఇప్పుడు త‌నకి 38 ఏళ్లు అని వ‌ర‌ల‌క్ష్మీ చెప్పారు.