మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట ఓ మూవీని తెరకెక్కించనున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించడం తెలిసిందే..
తొలి మూవీ బింబిసారతో సెన్సేషనల్ హిట్ సాధించిన వశిష్ట.. రెండో మూవీలోనే చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుని ఫుల్ కుష్లో ఉన్నారు.
దర్శకుడు వశిష్ట దర్శకత్వంవహించనున్న ఈ రెండో మూవీపై ఇప్పటికే టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ల కోసం వెతుకులాడుతున్నారు మేకర్స్.
చిరంజీవి సరసన హీరోయిన్గా అనుష్క, నయనతారను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరో ఒకరిని కన్ఫర్మ్ చేయొచ్చని తెలుస్తోంది.
వీరిద్దరితో పాటు సెకండ్ హీరోయిన్గా చిరంజీవి సరసన నటించేందుకు ఓ బాలీవుడ్ హీరోయిన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
వీరిలో చిరంజీవి సరసన ఎవరిని దర్శకనిర్మాతలు ఫైనల్ చేస్తారన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. అప్పటి వరకు మెగా ఫ్యాన్స్కు కాస్త ఓపిక పట్టాల్సిందే.
ఈ సినిమాను అక్టోబర్ లేదా నవంబరులో షూటింగ్ మొదలుపెట్టే యోచనలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.