TV9 Telugu

04 February 2024

'పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు.' రష్మికకు వార్నింగ్.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న ఒకరు.

పుష్పతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

అలాంటి రష్మిక తాజాగా మరో సారి చిక్కుల్లో పడ్డారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన రష్మిక..

తనకు సౌందర్య బయోగ్రఫీలో యాక్ట్ చేయాలని ఉందంటూ చెప్పింది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు తన తండ్రి సౌందర్య గురించే చెప్పేవారని తన జర్నీ చాలా ఇష్టం అంటూ కూడా చెప్పుకొచ్చింది.

అయితే ఇలా చెప్పే క్రమంలో సౌందర్యను ఏక వచనంలోనే కోట్‌ చేసింది. ఇక ఇది పట్టుకున్న కొంత మంది రష్మిక హేటర్స్..

రష్మికను మరోసారి ట్రోల్ చేయడం మొదలెట్టారు. పెద్ద వాళ్లకు మర్యాద ఇవ్వడం తెలీదా..

అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎలా అంటూ రష్మికను తిట్టిపోస్తున్నారు. వార్నింగ్‌లు ఇస్తున్నారు.