15 December 2023

యానిమల్ సినిమాకు త్రిప్తికు అంత తక్కువ రెమ్యునరేషనా !! 

కొద్ది రోజులుగా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న చిత్రం ‘యానిమల్’.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలలో కనిపించారు.

ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ అందుకున్న హీరోయిన్ త్రిప్తి రెమ్యునరేషన్‌గా మాత్రం చాలా తక్కువ అందుకుందట. 

యానిమల్ సినిమా కోసం త్రిప్తి అందుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

సెకండ్ హీరోయిన్ అయినా.. మెయిన్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ అందుకుని.. ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిన త్రిప్తి.

ఈ సినిమాకు కేవలం 40 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకుందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది.