02 February 2024

 అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా అంటున్న త్రిప్తి

TV9 Telugu

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.

గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

అయితే ఈ సినిమాతో అందరి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి డిమ్రి.

తాజాగా ఓ ఇంటర్వ్యూకి పెళ్లి ప్లాన్స్ ఎప్పుడు అని హోస్ట అడగ్గా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు త్రిప్తి.

ఇప్పటికిప్పుడు తన పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని.. ప్రస్తుతం తన కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టానని చెప్పారు.

కాబోయే భర్త ఎలా ఉండాలి అని హోస్ట్ అడగగా.. మంచి వ్యక్తి అయితే చాలు అదొక్కటే కోరుకుంటున్నా అంటూ టక్కున ఆన్సర్ ఇచ్చారు.

మంచిగా ఉంటే.. డబ్బు, పేరు వాటంతట అవే వస్తాయని కూడా.. తన మాటలకు పొడిగింపు మాటలు చెప్పారు.