సావిత్రి క్లాసిక్స్ ఆవిష్కరణ.. త్రినాథరావు నక్కిన నిర్మాతగా.. 

TV9 Telugu

05 April 2024

తెలుగు మహానటి సావిత్రి ప్రస్థానంపై ప్రముఖ రచయత సంజయ్ కిషోర్ రచించిన తాజా పుస్తకం సావిత్రి క్లాసిక్స్.

తాజాగా నిర్వహించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.

ఆయన చేతుల మీదుగానే ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి సైతం హాజరయ్యారు.

సంజయ్ కిషోర్ గతంలో మన అక్కినేని, మహానటుడు ఎన్టీఆర్, ఎస్.వి.రంగారావు ఫోటో బయోపిక్ మహానటుడు వంటి పుస్తకాలను రచించారు.

మాస్ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా బిజీ అవుతున్నారు.

తాజాగా ఈయన నిర్మాణంలో టాలీవుడ్ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా ఓ సినిమా మొదలైంది.

ఇందులో బ్లాక్ బస్టర్ దృశ్యం ఫేమ్ ఎస్తర్ అనిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కథానాయకిగా ఈమెకి ఇది తొలి చిత్రం.

తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.