25 September 2023
హీరోలను బిగ్ స్క్రీన్ మీద చూడటం కామన్.. కానీ వాళ్లే బుల్లితెరపైకి వస్తే అది సమ్థింగ్ స్పెషల్. మారిన కాలంతో పాటే మన హీరోలు కూడా మారిపోతున్నారు.
సినిమాలకు బ్రేకిచ్చిన హీరో మంచు మనోజ్.. తాజాగా రాకింగ్ గేమ్ షోతో వచ్చేస్తున్నారు. మరి మనోజ్తో పాటు ఈ మధ్య హోస్టులుగా మారిన హీరోలెవరో చూద్దామా..
ముఖ్యంగా డిజిటల్ వరల్డ్కూ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ ర్యాంప్ ఆడిద్దాం అంటూ గేమ్ షోతో వచ్చేస్తున్నారు. ప్రముఖ ఓటిటిలో త్వరలోనే అది రానుంది. తాజాగా ప్రోమో విడుదలైంది.
కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. ఈ మధ్యే వాట్ ది ఫిష్ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. అది సెట్స్పై ఉండగానే తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేస్తున్న గేమ్ షోకు హోస్ట్గా మారిపోయారు.
ఈయన మాత్రమే కాదు.. విశ్వక్ సేన్ సైతం ఈ మధ్యే ఆహాలో ఫ్యామిలీ ధమాకాతో బాగానే ఆకట్టుకుంటున్నారు. వరస సినిమాలతో పాటు గేమ్ షోకు డేట్స్ ఇచ్చారు మాస్ కా దాస్.
విశ్వక్ సేన్ కంటే ముందే బాలయ్యను సైతం హోస్టుగా మార్చేసారు ఆహా టీం. అన్స్టాపబుల్ షో అయితే ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.
మరోవైపు నాగార్జున గురించి చెప్పనక్కర్లేదు. ఇటు సినిమాలు చేస్తూనే.. బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా బుల్లితెరపై కనిపించారు.
రానా టాక్ షో బాగా పాపులర్ అయింది. మొత్తానికి మన హీరోలు ఇటూ అటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారిప్పుడు.