‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం.. ఆ ఆరుగురికి ఆస్కార్‌ నుంచి ఆహ్వానం..

రాజమౌళి తెరకెక్కించిన అద్భుత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

ఈ చిత్రంలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రబృందానికి మరో అరుదైన గౌరవం దక్కింది.

‘ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ఆస్కార్‌ను ప్రదానం చేస్తుంది.

ఈ అకాడమీ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందానికి చెందిన ఆరుగురిని సభ్యులుగా ఆహ్వానించింది.

ఈ చిత్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు, కీరవాణి, చంద్రబోస్‌, సెంథిల్‌ కుమార్‌, సాబు సిరిల్‌లు అందులో ఉన్నారు.

ఈ అకాడమీ ప్రపంచవ్యాప్తంగా 398 కొత్త సభ్యులు ఎంపికలో భాగంగా వీరిని ఆహ్వానించారు.

ఈ ఆరుగురికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు దర్శకుడు రాజమౌళి.

వీరితో పాటు ఇండియా నుంచి దర్శకులు మణిరత్నం, షౌనక్‌ సేన్‌, నిర్మాతలు కరణ్‌ జోహార్‌, సిద్ధార్థ్‌ రాయ్‌ తదితరులను ఆహ్వానించింది.