తమన్నాకు అన్యాయం జరిగిందా?

14 September 2023

రజనీకాంత్ హీరోగా సెల్సెన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ మూవీ కలెక్షన్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.. కురిపిస్తోంది..

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదుచేసుకుంది

రికార్డు స్థాయి కలెక్షన్స్ రావడంతో నిర్మాత కళానిధి మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఇతర టెక్నీషియన్లకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

రెమ్యునరేషన్‌కు అదనంగా హీరో రజనీకాంత్, దర్శకుడు సెల్సెన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు కోట్లాది రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారు కళానిధి మారన్.

మరీ ముఖ్యంగా రజనీకాంత్‌కు రూ.110 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు కలెక్షన్స్‌లో వాటాగా రూ.100 కోట్ల చెక్‌ను రజనీకాంత్‌కు అందజేశారు. తద్వారీ తలైవాకు జైలర్ మూవీతో మొత్తం రూ.210 కోట్లు అందింది.

అయితే తమన్నాకు ఎలాంటి బహుమతులు ఇవ్వలేదన్న కథనాలతో ఆమె ఫ్యాన్స్ జైలర్ నిర్మాతలపై మండిపడుతున్నారు. ఈ విషయంలో తమన్నాకు అన్యాయం చేయడం సరికాదంటున్నారు.

జైలర్ మూవీకి వచ్చిన కలెక్షన్స్‌లో తమన్నాతో పాటు రమ్య కృష్ణకు కూడా తగిన వాటా ఇవ్వాలని కళానిధి మారన్‌కు వారి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.