పాలలో తెలుపు.. గులాబీలోని సోయగం.. ఈ అమ్మడు రూపం..

TV9 Telugu

27 March 2024

21 డిసెంబర్ 1989న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి తమన్నా భాటియా.

ఆమె తల్లిదండ్రులు సంతోష్ మరియు రజనీ భాటియా. ఈ ముద్దుగుమ్మకు ఆనంద్ భాటియా అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.

ముంబైలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల తార.

ముంబైలోని RD & SH నేషనల్ & SWA సైన్స్ కాలేజ్ నుంచి డిస్టెన్స్ లో BA డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.

2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే బాలీవుడ్ రొమాంటిక్ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత మంచు విష్ణుకి జోడిగా శ్రీ అనే యాక్షన్ డ్రామా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.

తర్వాత తెలుగు దాదాపు అందరు స్టార్ హీరోల పక్కన నటించి స్టార్ కథానాయకిగా ఎదిగింది మిల్కీ బ్యూటీ తమన్నా.

ప్రస్తుతం తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఓదెల 2 సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ వయ్యారి.