ఆ తారల వెలుగు ఈమెలో దాచుకుందేమో.. చీరలో ఆకట్టుకుంటున్న శ్రీదేవి..

2002లో ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో తెలుగులో కథానాయకిగా పరిచయం అయింది శ్రీదేవి విజయ్ కుమార్.

తర్వాత తరుణ్ సరసన నిన్నే ఇష్టపడ్డాను చిత్రంలో హీరోయిన్ గా ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

తర్వాత నిరీక్షణ, ఆది లక్ష్మి, వీర వంటి చిత్రాల్లో నటించింది.

2016 తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుంది ఈ భామ.

2021లో కామెడీ స్టార్స్ షోలో జడ్జిగా బుల్లితెరపై అడుగుపెట్టింది.

ప్రస్తుతం ఆదివారం మా పరివారం, గుండె జారీ గల్లంతయ్యిందే, డ్రామా జూనియర్స్ 4 షోలలో జడ్జిగా చేస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి.

ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు  కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.

మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయ్యండి.