TV9 Telugu

శ్రీ విష్ణు స్వాగ్.. ఆహాలో పివి నరసింహారావు.. 

02 March 2024

హీరో శ్రీ విష్ణు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేసారు. ఈయన నటిస్తున్న ఓ భీమ్ బుష్ మార్చి 22న విడుదల కానుంది.

తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత‌గా శ్రీ విష్ణు త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను చేయ‌బోతున్నారు.

రాజ రాజ చోర ఫేమ్ హర్షిత్ గోళి దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి స్వాగ్ అనే టైటిల్ ఖరారు చేసారు మేకర్స్.

‘శ్రీ‌రాముల‌య్య’, ‘జ‌యం మ‌న‌దేరా’, ‘భ‌ద్రాచ‌లం’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎన్‌.శంక‌ర్.

ఈయన తాజాగా ఎన్ శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో బ్యాన‌ర్‌లో ఆయ‌న నిర్మాత‌గా, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ‌లో మూడు వెబ్ సిరీస్‌లు ప్రకటించారు.

తెలంగాణ సాయుధ పోరాటం, జ్యోతిరావు పూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ నేపథ్యంలో మూడు వెబ్ సిరీస్‌లు చేయనున్నట్లు ప్రకటించారు శంకర్.

మాజీ భారత ప్రధాని పివి నరసింహారావుకు ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. తాజాగా ఆహా అయన బయోపిక్ కి సిద్ధమైంది.

ఆహా స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రకాష్ ఝా తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌కు ‘హాఫ్ లయన్’ అనే టైటిల్ ఖరారు చేసారు.