సీరియల్‌ కోసం ఆడిషన్‌.. తెలుగు తెరపై కథానాయకిగా శాన్వీ..

నటి శాన్వీ మేఘన చదువుతున్న కాలేజ్‌లో ఓ షూటింగ్‌ సమయంలో ఆమెను చూసి ఒక సీరియల్‌ ఆడిషన్‌కు పిలిచారు.

కానీ ఆమె సినిమాల్లో నటించడం ఇంట్లో వాళ్లకు ఇష్టం కపోవడంతో ఆ ఛాన్స్ తిరస్కరించింది.

తర్వాత నటి జయసుధ నిర్మిస్తున్న ఓ సీరియల్‌ కోసం స్వయంగా జయసుధే అడగడంతో కాదనలేకపోయింది.

కొద్దిరోజుల్లోనే నటనపై ఆసక్తి, ఇష్టన్నీ పెంచుకుంది.

అయితే జయసుధ భర్త నితిన్‌ మరణంతో ఆ సీరియల్‌ ఆగిపోయింది.

తర్వాత ఎంతమంది చెప్పినా తిరిగి వెనక్కి వెళ్లకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది.

ఆ ప్రయత్నంలో తొలిసారిగా ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’ చిత్రంలో నటించింది.

ఆ తర్వాత ‘సైరా నరసింహా రెడ్డి’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ వంటి చిత్రాల్లో అదితి పాత్రలో కనిపించింది.

ఆనంద్‌ దేవరకొండ ‘పుష్పక విమానం’ చిత్రంతో శాన్వీ మేఘనకు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ప్రేమ విమానం’ చిత్రంతో అలరిస్తోంది.