ఇడ్లీ.. సాంబార్ అంటే ఊరుకోను.. శ్రుతి హాసన్ స్ట్రాంగ్ వార్నింగ్
21 June 2024
TV9 Telugu
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. ముక్కుసూటితత్వం, ఏదైనా ఓపెన్ గా మాట్లాడగలగడం ఈమె నైజం
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రుతి హాసన్. అప్పుడప్పుడూ సోషల్మీడియాలో ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తుంటుంది
అలా తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా మరోసారి అభిమానులతో ముచ్చట్లు పెట్టింది శ్రుతి హాసన్. అయితే తనకు ఎదురైన ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసిందామె.
సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా? అని ఓ నెటిజన్ అడగ్గా.. అందుకు శృతి హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
'ఈ రకమైన జాతివివక్షను నేను అస్సలు సహించను. మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస, సాంబార్.. ఇలాంటి పేర్లతో పిలిస్తే మేం ఊరుకోం' అంటూ వార్నింగ్ ఇచ్చింది.
మమ్మల్ని ఎలా పడితే అలా పిలిస్తే దాన్ని కామెడీగా తీసుకోం. కాబట్టి మర్యాదగా వ్యవహరించడం నేర్చుకోండి' అని హితవు పలికింది.
'సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు' అని తమిళంలో రాసి నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది శ్రుతి.
కాగా ఆ మధ్యన అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్లో షారూఖ్ ఖాన్.. రామ్చరణ్ను అందరిముందు ఇడ్లీ వడ అని పిలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. .
ఇక్కడ క్లిక్ చేయండి..