తెలుగు ప్రేక్షకులకు శ్రియ శరన్ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి వరుస హిట్లను సొంతం చేసుకుంది.
'ఇష్టం' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రియ. తన నటనతో అందరిమనసులను కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రేత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
నాగార్జున హీరోగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కిన నేనున్నాను సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి తో మరో హిట్ ను సొంతం చేసుకుంది.
శ్రియ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఒక ఊపు ఊపేసింది. శ్రియ సినిమా అంటే ఫ్యాన్స్ ఎగబడేవారు. అప్పట్లో ఈమె అంతటి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
2018 సంవత్సరంలో రష్యా క్రీడాకారులు ఆండ్రూ కొచ్చిన్ ను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. కొన్ని రోజులు పాటు సినిమాలకు దూరమైంది ఈ చిన్నది.
సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో ద్వారా రొమాంటిక్ స్టిల్స్ షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడు టచ్లోనే ఉంటుంది శ్రియ శరన్.