తాప్సి అందువల్లే తెలుగు సినిమాలకు దూరం అయ్యిందా ??

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ తాప్సి.

ఝుమ్మంది నాదం సినిమాలో మంచు మనోజ్ సరసన నటించి తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి వరుస విజయాలు అందుకుంది.

కానీ కెరీర్లో తాప్సీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే నటించడంతో ఆమెకు మెయిన్ హీరోయిన్ ఛాన్సులు తగ్గాయి.

దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిందనే వార్తలు వచ్చాయి.

అదే సమయంలో బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి క్లిక్ అయింది తాప్సీ.

అయితే వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమకు తాప్సీ దూరం కావడానికి ఆమెకు బలమైన కారణం ఉందట.

అదేంటంటే.. టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో కొడుకు తాప్సీతో మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేసి తన వెంట తిప్పుకున్నాడట.

ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారట. చివరకు పెళ్లి అనే సరికి చేతులెత్తేశాడట.

ఈ ప్రేమ విఫలమైన బాధను తట్టుకోలేక తాప్సీ అతని ముందు ఇండస్ట్రీలో ఉండలేక విడిచి వెళ్లిపోయిందంట.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై  తాప్సీ ఎప్పుడూ స్పందించలేదు