25 January 2024

చాలాసార్లు మోసపోయా.. డబ్బులు తిరిగి ఇవ్వలేదు.. శోభాశెట్టి.. 

TV9 Telugu

Pic credit - Instagram

కార్తీక దీపం సీరియల్‏తో మోనితగా ప్రేక్షకులను ఆకట్టుకుంది శోభా శెట్టి. ఆ తర్వాత బిగ్‏బాస్ ఏడో సీజన్‏లో ట్రోలింగ్ వచ్చినా తన ఆట తీరుతో చివరివారం వరకు నిలిచింది. 

 అబ్బాయిలను సైతం ఎదురించి ఆడేతీరు.. ఓటమిని అంగీకరించకపోవడం.. ప్రతిదానికి వాదించడంతో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అయినా అదేం పట్టించుకోనంటుంది. 

 బిగ్‏బాస్ షో నుంచి బయటకు వచ్చినా శోభా.. ఇప్పుడు పూర్తిగా తన పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టింది. తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో కలిసి కొత్త ప్రయాణం స్టార్ట్ చేయబోతుంది. 

ఇటీవలే తన పుట్టినరోజున యశ్వంత్ రెడ్డితో పెళ్లికి ముందడుగు వేసింది. జనవరి 20న తమ పెద్దవారు పెళ్లి తాంబులాలు మార్చుకున్నట్లు వీడియోను షేర్ చేసింది శోభాశెట్టి. 

ఇక ఇప్పుడు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారమైందని.. అయోధ్య రామమందిర ప్రారంభోత్సం రోజే తన కొత్తింటి తాళం తన చేతికొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. 

అయితే రెండేళ్ల క్రితమే ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‏మెంట్ నచ్చడంతో అడ్వాన్స్ డబ్బులు కట్టామని.. కానీ అది ఆగిపోయిందని.. ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పింది. 

అలా చాలాసార్లు మోసపోయామని.. ఇల్లు కొంటానా ? లేదా అని టెన్షన్ పడ్డానని.. బిగ్‏బాస్  ఇచ్చిన డబ్బులతో కాకుండా ఇప్పుడు కొన్న ఇంటిని రెండేళ్ల క్రితమే కొన్నామని తెలిపింది. 

కానీ ఆలస్యంగా ఆ ఇంటి తాళం తన చేతికి వచ్చిందని.. ఇంటీరియర్ డిజైనింగ్ కోసం మరో నాలుగు నెలలు పడుతుందని.. ఆ తర్వాతే కొత్తింటికి షిఫ్ట్ అవుతామని తెలిపింది.