TV9 Telugu

నన్ను వాళ్ళు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన సీరియల్ నటి కీర్తి.

04 April 2024

సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి భట్ బిగ్ బాస్ అవకాశంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

హౌస్ లో తనదైన అందం, ఆట శైలితో ప్రేక్షకులను మెప్పించింది కీర్తి. తాజాగా ఈ అమ్మడికి మ్యారేజ్ కూడా అయ్యింది.

తాజాగా కీర్తి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాను అని. కొరియర్‌ కోసం ఓ లింక్‌ క్లిక్‌ చేసి తన డబ్బు కోల్పోయను అని తెలిపింది.

తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను షేర్ చేసిన కీర్తి.. తాను సైబర్ నేరగాళ్ల బారిన పడినట్టు ఆవేదన వ్యక్తం చేసింది.

నాకు ఒక కొరియర్ రావాలి... వారం రోజులు దాటిపోయినా రాలేదు. దాంతో నాకు ఒక ఫోన్ వచ్చింది. దాని అడ్రస్ అప్డేట్ కాలేదు..

అయితే దాని కోసం రెండు రూపాయిలు కట్టాలని ఓ లింక్ పంపారు. ఆ లింక్ క్లిక్ చేస్తే రెండు రూపాయలు కట్ అయ్యాయి.

ఆతర్వాత 99 వేలు ఒకసారి, మరో 99 వేలు మరోసారి కట్ అయ్యాయి. దాంతో ఏం చెయ్యాలో అర్ధం కాక పోలీసులను ఆశ్రయించాం..

నా డబ్బులు వస్తాయని పోలీసులు చెప్పారని తెలిపింది కీర్తి భట్.ఈమె ప్రస్తుతం మధురానగరిలో అనే సీరియల్ లో నటిస్తుంది.