25 October 2024

మరోసారి రామ్ చరణ్ సరసన సమంత.. ఆ డైరెక్టర్ ప్లాన్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే తిరిగి మీడియా ముందుకు వస్తుంది. 

చాలా కాలంగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సామ్.. ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సమంత తెలుగులో మరిన్ని సినిమా ఆఫర్స్ ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్‎కు ఓకే చెప్పేసిందట. 

రంగస్థలం (2018) సినిమా తర్వాత మెగా హీరో రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‏లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్  బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. 

అయితే ఇందులో రంగస్థలం సినిమాలో హీరోయిన్‏గా నటించిన సమంత ఇప్పుడు ఈ సినిమాలోనూ కథానాయికగా నటించనుందని టాక్. 

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరిగాయని టాక్ వినిపిస్తుంది. రంగస్థలం తర్వాత మరోసారి చరణ్, సామ్ కలిసి నటించనున్నారట.