ఈ సారి ఎలాగైనా ముగిపు పలుకుతా.. సమంత పోస్ట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది.

అదే విధంగా ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి కావచ్చిందని తెలుస్తుంది.

ఈ విధంగా సమంత తన సినిమా ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసుకుని ఏడాది పాటు విరామం ప్రకటించినట్లు తెలిసిందే.

గతంలో మయోసైటిసిస్ బారిన పడిన సమంత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ అయ్యారు.

అయితే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసినటువంటి పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో భాగంగా ఒక పోస్టులో మరో మూడు రోజుల్లో కారవాన్ లైఫ్ మొదలవ్వబోతుంది అంటూ చెప్పుకొచ్చారు.

మరో స్టోరీలో తన ఫోటోని షేర్ చేస్తూ.. చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ ఆరు నెలలు, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలని పోస్ట్ చేసింది.

దీంతో ఎంత కష్టమైనా ఈసారి మాత్రం మయోసైటిస్ కి ముగింపు పలకాలని సమంత నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.