గుడ్ న్యూస్ చెప్పిన్ సమంత.. ఎట్టకేలకు..

21 September 2024

Basha Shek

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా సినిమాలు బాగా తగ్గించేసింది. ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయింది.

గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అభిమానులను పలకరించింది సమంత. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.

మయోసైటిక్ కు సంబంధించి  చికిత్స తీసుకుంటోన్న ఆమె కెమెరా ముందు కనిపించి చాలా నెలలు గడిచిపోయాయి.

దీంతో ఫ్యాన్స్ సమంత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేటట్టు లేదని నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది సామ్.

తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును ప్రకటించింది సమంత. అనిల్ బార్వే ద‌ర్శ‌క‌త్వంలో  ర‌క్త బ్ర‌హ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తున్నట్లు తెలిపింది సామ్.

ఫ్యామిలీ మ్యాన్ ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ అండ్ డీకే ఈ హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు క్రియేట‌ర్స్‌గా, ప్రొడ్యూస‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తోన్నారు.

'కలలు కనడం ఎప్పుడూ ఆపవద్దు. కొంత కాలం తర్వాత మళ్లీ సినిమా సెట్స్‌పైకి రావడం ఆనందంగా ఉంది’’ అని పోస్ట్ పెట్టింది సామ్.

ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు.