శ్రీదేవి చావుకు కారణం.. ఉప్పు!

10 October 2023

ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ అతిలోక సుందరిగా చనిపోయేంత వరకు లైఫ్ లీడ్ చేసిన శ్రీదేవీ.. ఉప్పు కారణంగానే చనిపోయారట.

సినిమాల్లో ఎప్పుడు నాజూకుగా కనిపించాలని, అందం కాపాడుకోవాలని ఎప్పటి నుంచో విపరీతంగా డైట్ చేసేవారట ఈమె.

ఆ క్రమంలోనే ఉప్పు తక్కువగా ఉండే సలాడ్స్‌ను... లిక్విడ్స్‌ను ఎక్కువగా తీసుకునేవారట హీరోయిన్ శ్రీదేవి.

ఆమె శరీరానికి సరిపడనంత ఉప్పు తీసుకోకపోవడంతో.. అతిలోక సుందరి శ్రీదేవి లో బీపీ బారిన పడ్డారని సమాచారం.

రక్తపోటు ఉన్న కారణంగానే శ్రీదేవి అప్పుడప్పుడు కళ్లు తిరిగి కింద పడేవారట. అనారోగ్యానికి గురయ్యేవారట శ్రీ దేవి.

తన భర్త బోనీ కపూర్, ఫ్యామిలీ డాకర్లు ఎంత చెప్పినా కానీ.. తన ఫుడ్‌ హ్యాబిట్స్ మాత్రం మార్చకపోయేవారట శ్రీదేవి.

దీంతో లో బీపీ మరింతగా ఎక్కువై.. ప్రమాదవాశాత్తు నీళ్లున్న బాత్‌ టబ్‌లో స్ప్రుహ తప్పి పడిపోయి చనిపోయారు ఆమె.

అయితే శ్రీదేవి మరణానికి కారణం లోబీపే అంటూ.. తేల్చిన కొంత మంది డాక్టర్లు.. ఉప్పును నిర్లక్ష్యం చేయొద్దంటూ సూచిస్తున్నారు.