05 December 2023

పాన్ ఇండియా స్టార్ హీరో యష్ సరసన సాయిపల్లవి. ఇక హిట్టే.. 

Pic credit - Instagram

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. న్యాచురల్ బ్యూటీకి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఫ్యాన్స్ ఎక్కువే. 

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 

అయితే తెలుగు చివరగా విరాట పర్వం సినిమాలో నటించిన సాయి పల్లవి చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం నాగచైతన్య జోడిగా తండెల్ చిత్రంలో నటిస్తుంది. 

అటు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ జోడిగా నటిస్తుంది. అయితే ఇప్పుడు సాయి పల్లవికి క్రేజీ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా హీరోతో. 

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న యష్ జోడిగా సాయి పల్లవి కనిపించనుందని టాక్. అతని 19వ సినిమాలో నటిస్తుందట. 

ఈ సినిమాను లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ రూపొందించనున్నారని.. డిసెంబర్ 8న ఈ మూవీ గురించి అధికారికంగా అప్డేట్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. 

ఈ సినిమాలో యష్ జోడిగా సాయి పల్లవి కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ నిజమైతే సాయి పల్లవి క్రేజ్ మరింత పెరిగినట్టే. 

అంతేకాకుండా పాన్ ఇండియా రేంజ్‏లో సాయి పల్లవి సక్సెస్ అయితే అంతకుమించిన అవకాశాలు ఈ ముద్దుగుమ్మ చెంత చేరడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.