03 April 2024

ఏం అమ్మాయి రా బాబు.. ఆ విషయంలో సాయి పల్లవి అస్సలు మారలేదు..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రలో సౌత్ అడియన్స్ మనసులు దోచేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. 

 ప్రేమమ్ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ కేరళ కుట్టి. 

ఇండస్ట్రీలోని హీరోయిన్లలో సాయి పల్లవి ప్రత్యేకమనే చెప్పాలి. గ్లామర్ రోల్స్‏కు దూరంగా ఉంటూ తనకు ఇచ్చిన పాత్రలకు ప్రాణం పోస్తుంది. 

సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలే అయినా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకుని.. ప్రతి సినిమాలో తనదైన మార్క్ చూపిస్తుంది. 

ఇటు తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి.. ఇప్పుడు హిందీలోకి ఎంట్రీ ఇస్తుంది. అమీర్ ఖాన్ తనయుడితో కలిసి నటిస్తుంది. 

బాలీవుడ్‏లోనూ సాయిపల్లవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కానీ పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు తప్ప వేరేవాటిని కాదనే కండీషన్ కొనసాగిస్తుందట. 

తనకు నచ్చిన కథ కోసం రెమ్యునరేషన్ కాస్త తక్కువైనా తీసుకునే పల్లవి నచ్చని కథ కోసం ఎంత ఎక్కువ పారితోషికం ఇస్తానన్నా ఒప్పుకోవడం లేదట.

సాయి పల్లవిని పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే హీరోయిన్స్ అందరిలో తను స్పెషల్ అని.. బాలీవుడ్ వెళ్లినా ఏమాత్రం మారదని కామెంట్స్ చేస్తున్నారు.