03 September 2024

పదేళ్లుగా అతడినే ప్రేమిస్తున్న సాయి పల్లవి.. ఇంతకీ ఎవరంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాది చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోయిన్స్ అందరిలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రత్యేకం. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. 

గ్లామర్‏ను ఏమాత్రం పట్టించుకోకుండా.. కేవలం తన నటనా ప్రతిభను.. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్. 

గ్లామర్ జోలికి వెళ్లకుండా ట్రెడిషనల్ లుక్‏లో మేకప్ లేకుండానే అద్భుతమైన నటనతో సౌత్ అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. 

సహజ నటన, అందమైన డ్యాన్స్‏తో వెండితెరపై అత్యధ్బుతంగా కనిపిస్తుంది సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 

ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో అలాగే హిందీలో రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది.  

తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సాయి పల్లవి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. తనకు మహాభారతం అంటే ఎక్కువగా గౌరవం ఉందని తెలిపింది. 

అందులో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అంటే తనకు చాలా ఇష్టమని.. గత 17 ఏళ్లుగా అభిమన్యుడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని.. 

అంతేకాకుండా గత పదేళ్లుగా అతడినే ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది. దీంతో సాయి పల్లవి ప్రేమ మాములుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.