ఆ అందం ఈ వయ్యారిని  తన గుండెల్లో దాచుకుందేమో..

TV9 Telugu

01 February  2024

12 అక్టోబర్ 1993న ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో ఓ భారతీయ పంజాబీ కుటుంబంలో జన్మించింది రుక్సార్ ధిల్లాన్.

ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం గోవాలో పెరిగింది. ఈ బ్యూటీ కుటుంబం ఇప్పుడు కర్ణాటకలోని బెంగళూరులో స్థిరపడింది.

గోవాలోని మనోవికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్; బెంగళూరులోని బాల్డ్విన్ గర్ల్స్ హై స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తిచేసింది.

కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.

2016లో రన్ ఆంటోనీ అనే కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

2017లో ఆకతాయి అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

2018లో కృష్ణార్జున యుద్ధంలో నాని సరసన నటించింది. 2019లో ABCD: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీలో కనిపించింది.

2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం నటించింది. ఇటీవల నా సామీ రంగ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన నటించింది.