21 January 2024

విజయ్ దేవరకొండ జోడిగా సప్త సాగరాలు దాటి హీరోయిన్.. 

TV9 Telugu

Pic credit - Instagram

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ రుక్మణి వసంత్. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటుంది. 

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో రక్షిత్ శెట్టి సరసన నటించి మెప్పించింది. 

సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమాలో నటించిన రుక్మిణి వసంత్ తన నటనతో ప్రశంసలు అందుకుంది.  ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. 

బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. లండన్ వెళ్లి యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి తిరిగి వచ్చింది. 

కన్నడ సినిమాల్లో నటించిన ఆమె.. సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయ్యింది. ఈ సినిమాలతోనే పాన్ ఇండియా సినీ ప్రియులను ఫిదా చేసింది రుక్మిణి. 

తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. 

డైరెక్టర్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా ఆఫర్ అందుకుందని టాక్. 

లాగే ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టులోనూ ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించే సినిమాలో రుక్మిణిని సెలక్ట్ చేశారట.