టాలీవుడ్ లోకి దూసుకొస్తున్న కన్నడ సోయగం.. రుక్మిణి క్రేజ్ మాములుగా లేదుగా 

15 September 2025

Rajeev  

కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా సప్త సాగరాలు దాటి సినిమా. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

 ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా.. కథానాయికగా అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్.

బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారి హిందీలో అప్ స్టైర్స్ అనే సినిమాలో నటించింది.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ వయ్యారికి ఇప్పుడు సోషల్ మీడియా భారీ ఫాలోయింగ్ వచ్చేసింది.

తెలుగుతోపాటు కన్నడలోనూ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కన్నడలో శ్రీమురళీకి జోడిగా భఘీర చిత్రంలో నటించింది.

అలాగే నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. కన్నడ, తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందని టాక్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.