మరోసారి దేవుడి పాత్రలో రెబెల్ స్టార్..

ప్రభాస్ హీరోగా వస్తోన్న సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం ప్రాజెక్ట్ కె.

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుంది.

ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ చిత్రం హైప్ మీరింత పెరిగింది.

70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర గురించి సోషల్ మీడియా ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రం పురాణాల ఆధారంగా రానుందని, ప్రభాస్ మహా విష్ణువు అవతారంలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వైజయంతి మూవీస్ పతాకంపై రూ.500 కోట్ల బడ్జెట్ తో అశ్వని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.