అబ్బా.. ఏం అందం గురు.. అందుకే అవకాశాలు క్యూ కట్టేస్తున్నాయి.

Anil Kumar

29 July 2024

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ఇప్పుడు హీరోయిన్ "భాగ్యశ్రీ బోర్సే" వంతు.!

రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా భాగ్య శ్రీ కి తెలుగులోనే హీరోయిన్ గా మరో క్రేజీ అవకాశం అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈమె నటించిన ఫస్ట్ సినిమా విడుదలకు కాకముందే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ క్యూ కట్టాయి. అంటే ఈ బ్యూటీ అలాంటిది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీని ఎంపిక చేశారట.

విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో కొత్త సినిమా VD12 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ స్పై థ్రిల్లర్ సినిమా‏లో మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

ఇదిలా ఉంటె ఈ అమ్మడికి సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది భాగ్య శ్రీ.