రత్నం ప్రెస్ మీట్..

TV9 Telugu

21 April 2024

కోలీవుడ్ హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా ప్రముఖ దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ రత్నం.

‘భరణి’, ‘పూజ’ లాంటి హిట్స్ తర్వాత విశాల్-హరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ సినిమాని జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఇన్వెనియో ఆరిజిన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, కోలీవుడ్ స్టార్ యోగిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.

ఈ ప్రెస్ మీట్ సందర్భంగా రత్నం సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు ఈ సినిమా తెరకెక్కించిన దర్శక నిర్మాతలు.

రత్నం తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.