23 June 2024

ఎన్టీఆర్ జోడిగా నేషనల్ క్రష్.. ప్రశాంత్ నీల్ మూవీకి రష్మిక ఓకే..

Rajitha Chanti

Pic credit - Instagram

నేషనల్ క్రష్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.

ఇప్పుడు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ తనకు వచ్చే ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు టాక్. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసింది. 

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నాను హీరోయిన్‏గా సెలక్ట్ చేశారట.

NTR31 వర్కింగ్ టైటిల్‏తో ఈ సినిమాలో తారక్ సరసన నటించేందుకు రష్మిక కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అఫీషియల్ ప్రకటన రానుంది. 

ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో మొదటి సారి ఎన్టీఆర్, రష్మిక కలిసి కనిపించనున్నారు. 

ఇవే కాకుండా మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ జోడిగా కనిపించేందుకు రెడీ అయ్యింది రష్మిక. అదే సికిందర్. ఇది ఆమెకు హిందీలో రెండో ప్రాజెక్ట్. 

సల్మాన్ ఖాన్ హీరోగా.. కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న సికిందర్ సినిమాలో రష్మిక హీరోయిన్. షూటింగ్‏లో జాయిన్ అయినట్లు టాక్.