08 March 2024

సంవత్సరానికి ఒకసారి ఆ దేశానికి వెళ్తానంటున్న రష్మిక.. ఎందుకంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది.  

ఇటీవల జపాన్ టోక్యో నగరంలో జరిగిన క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ వేడుకలో భారత్ తరపున పాల్గొంది రష్మిక. తొలిసారి ఆ ఛాన్స్ అందుకున్న హీరోయిన్ తనే. 

జపాన్ వెళ్లిన రష్మిక ఊహించని స్థాయిలో వెల్ కమ్ చెప్పారు అక్కడి ఫ్యాన్స్. ఎయిర్ పోర్టు వెలుపల రష్మిక ప్లకార్డులు పట్టుకుని గ్రాండ్‏గా స్వాగతం పలికారు. 

 ఇలాంటి గొప్ప ఆహ్వానం ఇంతవరకూ స్వదేశంలో కూడా చూడలేదని.. తొలిసారి ఓ గొప్ప అనుభూతి కలిగిందని చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా. 

ఇకపై తాను ఏడాదికొకసారి తప్పకుండా జపాన్ వస్తానని అక్కడ అభిమానులకు ప్రామిస్ చేసింది రష్మకి. ప్రతి ఏడాది ఓ వెకేషన్ లా టూర్ వేస్తానని తెలిపింది. 

చూడాల్సిన నగరం టోక్యో అని.. ఇంకా చూడాల్సిన మరెన్నో అందాలు అక్కడ ఉన్నాయని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరలవుతుంది. 

పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకుంది రష్మిక. ఆ తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో ప్రతి ప్రాజెక్ట్ ఓకే చేసింది. హిందీలో ఓకేసారి నాలుగైదు సినిమాలు చేసింది. 

ఇక ఇటీవలే యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో మరోసారి నటనకు ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు పుష్పరాజ్ భార్య శ్రీవల్లి కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.