TV9 Telugu

ఆ హీరో కోసమే సినిమా.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన రష్మిక

15 Febraury 2024

అల్లుఅర్జున్‌ నటించిన  పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌ లో ఫేమస్ అయిపోయింది కన్నడ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్‌ వంటి దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది.

సినిమాలు, షూటింగ్‌ల సంగతి పక్కన పెడితే ఎప్పుడు ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది రష్మక మందన్నా.

ఇప్పుడు కూడ నేషనల్‌ క్రష్‌కు సంబందించిన ఒక ఆసక్తికరమైన పుకారు ఫిలిం సర్కిల్స్ లో షికార్లు చేస్తోంది. అదేంటంటే..

యంగ్‌ హీరో శర్వానంద్‌ తో కలిసి రష్మిక మందన్నా నటించిన చిత్రం ఆడాళ్ళు మీకు జోహార్లు. తిరుమల కిషోర్ దర్శకుడు

అయితే ఈ  సినిమా ను రష్మిక కేవలం దర్శకుడు, హీరో కోసమే చేసిందని కథ ఆమెకు అసలు నచ్చలేదని రూమర్స్ వైరల్ గా మారాయి.

 తాజాగా  ఈ వార్తల పై స్పందించింది రష్మిక మందన్నా. ఈ రూమర్లలో అసలు వాస్తవం లేదు అని కొట్టిపారేసింది

ఎవరు చెప్పారు మీకు..? అవ్వన్నీ వట్టి పుకార్లు మాత్రమే.. నేను కథను నమ్మే సినిమాలు చేస్తాను' అంటూ కుండ బద్దలు కొట్టేసింది రష్మిక.