21 September 2023

రాజమౌళి వారి మాట వింటారా?

దర్శకధీరుడు రాజమౌళి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రెడీ అయ్యారు. భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో జక్కన్న భాగస్వామ్యం అవుతున్నారు. 

ఈ పాన్ ఇండియా మూవీలో కొందరు టాలీవుడ్ అగ్ర హీరోలు నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో ఎస్ఎస్ కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. 

భారతీయ సినిమా ఇండస్ట్రీ ఎక్కడ పుట్టింది..? దానికి మూలం ఏంటి? అనే అంశం ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించనున్నారు. 

ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ కూడా వచ్చేసింది. ‘మేడ్ ఇన్ ఇండియా’ టైటిల్‌తో ఈ మూవీని రూపొందించనున్నట్లు రాజమౌళి ప్రకటన చేశారు. 

ఈ మూవీ టైటిల్‌కి సంబంధించి రాజమౌళికి ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ సూచన చేస్తున్నారు. కామెంట్స్ రూపంలో తమ సలహాను ఇస్తున్నారు.. 

ఈ మూవీ టైటిల్‌లో 'ఇండియా'కు బదులుగా 'భారత్‌'ను చేర్చాలని దర్శకుడు రాజమౌళికి ఆయన అభిమానులు సూచిస్తున్నారు. 

ఇండియా పేరును భారత్‌గా మారుస్తారని ప్రచారం జరుగున్నందున ‘మేడ్ ఇన్ ఇండియా’ అని కాకుండా ‘మేడ్ ఇన్ భారత్’ అని సినిమాకు నామకరణం చేయాలన్నది అభిమానుల సూచన

అయితే అభిమానుల సలహాపై ఇటు రాజమౌళి.. అటు మేకర్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి అభిమానుల సలహాలను రాజమౌళి పట్టించుకుంటారో లేదో వేచిచూడాల్సిందే..

నెటిజన్ల సలహాలను సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఈ మూవీ టైటిల్‌ను ‘మేడ్ ఇన్ భారత్’గా మార్చే అవకాశముంది.