ఆ బ్రహ్మ ఈ భామకి వెన్నెలతో ప్రాణం పోసాడు.. రాశిఖన్నా పిక్స్ అదుర్స్..

TV9 Telugu

17 July 2024

30 నవంబర్ 1990 సంవత్సరంలో భారతదేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ రాశిఖన్నా.

ఢిల్లీలోని సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.

ఢిల్లీ నగరంలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందింది ఈ అందాల తార.

చదువుపై ఎక్కువ ఆసక్తి కనబరిచింది. నటనలో కెరీర్ మొదలుపెట్టకముందు IAS అధికారి కావాలని ఆకాంక్షించింది ఈ వయ్యారి.

ఆమెకు మోడలింగ్‌పై ఆసక్తి లేదని, నటి కావాలని ఆలోచన కూడా లేదని కానీ విధి ఆమెను నటిగా మార్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

కళాశాల రోజుల్లో ప్రకటనల కోసం కాపీ రైటింగ్‌ ప్రయత్నించింది. చలనచిత్రాలకు ముందు వివిధ ప్రకటనలలో నటించింది.

2014లో నాగ శౌర్య సరసన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంతో తెలుగులో కథానాయకిగా అరంగేట్రం చేసింది ఈ అందాల భామ.

జిల్, బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవ కుశ వంటి సినిమాలతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయిపొయింది.