ఈమెనే వెన్నెలగా తలచి ఆ చంద్రుడు వెంట పడతాడేమో..

18 November 2023

20 నవంబర్ 1994న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ప్రియాంక అరుళ్ మోహన్.

ఆమె తండ్రి అరుల్ మోహన్ వ్యాపారవేత్త, తల్లి కృష్ణ మోహన్ గృహిణి. వీరిద్దరికి ఏకైక కుమార్తె ఈ వయ్యారి భామ.

పాఠశాల విద్యను చెన్నైలో పూర్తి చేసి, చెన్నైలోని డాన్ బాస్కో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీని పొందింది.

2019లో గిరీష్ జి దర్శకత్వం వహించిన ఓంధ్ కథే హెల్లా అనే కన్నడ చిత్రంలో ప్రియాంక అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

అదే ఏడాది నానికి జోడిగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో కథానాయకిగా తెలుగు సినీ రంగప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత శర్వానంద్ సరసన హీరోయిన్ గా శ్రీకారం చిత్రంలో నటించింది. తన అందంతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించింది.

2021లో డాక్టర్ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది. తర్వాత ఈతర్క్కుమ్ తునింధవన్, డోన్ అనే తమిళ చిత్రాల్లో కనిపించింది.

ప్రస్తుతం తెలుగులో ఓజి, సరిపోదా శనివారం; తమిళంలో కెప్టెన్ మిల్లర్, బ్రదర్ చిత్రాల్లో నటిస్తుంది ఈ వయ్యారి.