ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ప్రియమణి..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి తెలియని వారుండరు.

దాదాపు అందరూ స్టార్ హీరోలతో ఆడిపాడింది.

ఎవరే అతగాడు చిత్రంతో ఇండస్ట్రీ పరిచయం అయింది.

తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.

2017లో కెరియర్ పీక్ లో ఉండగానే ముస్తఫా అనే ముస్లిం వ్యక్తిని పెళ్లాడింది.

అతనికి అది రెండో పెళ్లి. ప్రియమణి పెళ్లి చేసుకునే టైంకి అతను తన మొదటి భార్యకి విడాకులు కూడా ఇవ్వలేదు.

దాంతో, ఆమెని చాలా మంది విమర్శిస్తూ బాగా ట్రోల్ చేసారు.

ఆమెకి పెళ్లి అయి ఇప్పటికే ఆరేళ్ళు పూర్తి కాగా ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటోంది ఈ భామ.

“అప్పుడే కాదు ఇప్పుడు కూడా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. కానీ నేను ఎప్పుడూ ఎవరి కామెంట్స్ ని పట్టించుకోను.

నా జీవితం నా ఇష్టం అనేది నా పాలసీ. నేను ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు,” అని అంటుంది ప్రియమణి.