TV9 Telugu

జర్మన్ లగ్జరీ కారు కొన్న బిజీ యాక్టర్ ప్రియమణి.. ధర ఎంతంటే.?

టాలీవుడ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎవరే అతగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ ప్రియమణి.

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన యమదొంగ స్టార్ డమ్ అందుకుంది ఈ అమ్మడు.

పెళ్లి తర్వాత ఇండస్ట్రీకిలో కొంత గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‏లో దూసుకుపోతుంది.

థియేటర్లలో, ఓటీటీలలో వరుస సినిమాలు చేస్తూ  వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా బిజీగా ఉంటుంది అనే చెప్పాలి ఈ అమ్మడు.

ఇటీవల భామాకలాపం 2 వెబ్ సిరీస్‏తో మంచి హిట్ అందుకుంది. అండ్ ప్రియా నటించిన ఆర్టికల్ 370 మూవీ విజయవంతంగా రన్ అవుతుంది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ ప్రియమణి.. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది.

జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది ప్రియమణి. ఈ కారు ధర దాదాపు రూ. 74 లక్షల వరకు ఉంటుంది.

హీరోయిన్ ప్రియమణి కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈ అమ్మడి అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యార్.