ఆ చుక్కల్లాన్ని వెంటపడవా ఈ వయ్యారిని వెన్నెల అని తలచి..

TV9 Telugu

15 May 2024

31 డిసెంబర్ 1989న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది అందాల భామ ప్రియా భవాని శంకర్. అసలు పేరు సత్యప్రియా భవాని శంకర్.

చెన్నైలోని SBOA మెట్రిక్యులేషన్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పాఠశాల విద్యను పుర్తి చేసింది ఈ వయ్యారి.

చెన్నైలో B.S. అబ్దుర్ రెహమాన్ క్రెసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీలో బి.టెక్, ఎంబిఏ చదివింది.

2017లో తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం మేయాద మాన్‌లో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి. తొలి సినిమాతో హిట్ అందుకుంది.

తర్వాత 2018లో కార్తీకి జోడిగా కడైకుట్టి సింగం (తెలుగులో చినబాబు) చిత్రంలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

2023లో యువ కథానాయకుడు సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం తెలుగులో సత్య దేవ్ కి జోడిగా జీబ్రా, గోపిచంద్ సరసన భీమా చిత్రాల్లో కథానాయకిగా నటిస్తుంది ఈ భామ.

వీటితో పాటు డెమోంటే కాలనీ 2, భారతీయుడు 2 అనే మరో రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇవి రెండు కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.