13  August 2024

ఒక్క సినిమాతో సెన్సెషన్.. ఇప్పుడు సైలెంట్ అయిన మమితా..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రేమలు సినిమాతో సౌత్ యూత్‏కు ఎక్కువగా కనెక్ట్  హీరోయిన్ మమితా బైజు. ఈ మలయాళీ సూపర్ హిట్ సినిమాతో నెట్టింట మంచి ఫాలోయింగ్ సొంతం చేసకుంది

ఇందులో కథానాయికగా నటించిన మమితా బైజు నటనకు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి సైతం ఫిదా అయ్యాడు. రీను పాత్రలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

తెలుగు కుర్రకారు హృదయాలను దొచుకున్న ఈ బ్యూటీ కుర్రాళ్ల క్రష్‏గా మారిపోయింది. ఇదివరకు మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 

2001 జూన్ 22న కేరళలోని కొట్టాయం ప్రాంతంలో జన్మించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నట్లుగా సమాచారం. 2017లో సర్వోపరి పాలక్కారన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత జావా, అల్ఫోన్సా, ఖోఖో, ప్రణయ విలాసం సినిమాల్లో నటించింది. కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డ్ అందుకుంది. 

ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత జావా, అల్ఫోన్సా, ఖోఖో, ప్రణయ విలాసం సినిమాల్లో నటించింది. కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ ఉత్తమ నటి అవార్డ్ అందుకుంది. 

మమితా బైజు తండ్రి డాక్టర్. 12వ తరగతి తర్వాత మెడిసిన్ తీసుకోవాలని మంచి డాక్టర్ కావాలని తన కుటుంబసభ్యులు అనుకున్నారని.. కానీ నటిగా మారనని తెలిపింది. 

ప్రేమలు సినిమాతో తెలుగులోను మమితాకు ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. ఇందులో రీను పాత్రలో మమితా నటన చూసి తెలుగు అడియన్స్, సెలబ్రెటీలు ఫిదా అయ్యారు.