02 February 2025

ఆ హీరోయిన్ తీరును తప్పుబట్టిన ప్రగ్యా జైస్వాల్.. ఎందుకంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే డాకు మహారాజ్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తీరును తప్పుపట్టారు.

కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి విషయంలో ఊర్వశీ రౌతేలా మాట్లాడిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రగ్యా మాట్లాడుతూ.. అద్భుతమైన చిత్రాల్లో భాగమై, గొప్ప నటీనటులతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు గౌరవంగా ఉండాలి. 

కొన్ని సందర్భాల్లో గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విషయం ఏదైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని అన్నారు.

ఏదైన విషయం మీద కామెంట్ చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఇతర నటీనటుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని అన్నారు. 

మరీ అంత కఠినంగా ఉండకూడదు. ఏది ఏమైనా ఆమె క్షమాపణలు కూడా చెప్పడం మంచిదైంది అంటూ ప్రగ్యా చెప్పుకొచ్చింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలో ప్రగ్యా , శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన సంగిత తెలిసిందే.